అమెరికాలో తెలుగు విద్యార్థులకు షాక్, కల తారుమారు: ఫేస్బుక్తో ఇరికిపోయారు
హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఇరవై మంది తెలుగు విద్యార్థులను ఆదివారం చికాగో విమానాశ్రయం నుంచి అధికారులు వెనక్కి పంపించారు. దీనికి విద్యార్థులు ఫేస్బుక్లో పంచుకున్న సమాచారం కూడా కారణమని చెబుతున్నారు.
ఫేస్బుక్ తెలుగు విద్యార్థుల అమెరికా కలలను తారుమారు చేసింది. ఫేస్బుక్లో స్నేహితులకు పంపిన సమాచారం చివరి నిమిషంలో వారిని స్వదేశానికి తిప్పి పంపేలా చేసింది. విద్యార్థుల్ని అమెరికా అధికారులు వెనక్కి తిప్పి పంపడానికి ఫేస్బుక్ దోహదపడిందంటున్నారు.
వందల మంది కేవలం రెండు విశ్వవిద్యాలయాల్లోనే ఎందుకు చేరుతున్నారు? అదే అనుమానంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుగు విద్యార్థుల ఫేస్బుక్ ఖాతాలను తనిఖీ చేశారు.

అందులో అమెరికాలో చదువుకోవడానికి అవసరమైన డబ్బును బ్యాంకు ఖాతాలో ఉండేలా ఎలా చక్కబెట్టింది, స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎలా చూపింది.. తదితర సమాచారాన్ని స్నేహితులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వెనక్కి పంపించారు.
ఫేస్బుక్లోని సమాచారంతో విద్యార్థుల స్థాయిని, మనస్తత్వాన్ని కూడా అంచనా వేసినట్లు చెబుతున్నారు. కాగా, గతంలో మూడు నాలుగు ప్రశ్నలు వేసి పంపించేవారని, ఇప్పుడు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని కూడా చెబుతున్నారు.
-
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఇరాన్తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications