స్కూల్ బస్సు ప్రమాదం, వేగమే కారణం (పిక్చర్స్)
విజయవాడ: తిరుచానూరు - చంద్రగిరి జాతీయ రహదారి మార్గంలో తనపల్లె క్రాస్ వద్ద ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మంది విద్యార్దులు గాయపడ్డారు. సీఐ రామకృష్ణారావు తెలిపిన ప్రకారం... బుధవారం ఉదయం తిరపతి జయనగర్లోని మదర్ ల్యాండ్ విద్యాసంస్దలకు చెందిన బస్సు తనపల్లెలోని తమ విద్యార్దులను తీసుకుని తిరుపతి బయలు దేరింది.
మార్గం మద్యలో తనపల్లె క్రాస్ వద్ద పాఠశాల బస్సును చిత్తూరు నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకోని దాదాపు పది అడుగుల దూరం వరకు లాక్కెళ్లింది. బస్సు క్రింద పడే సమయానికి మార్కెట్ యార్డు వైపు నుంచి వస్తున్న తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు అడ్డు రావడంతో దానికి తగిలి ఆగిపోయింది.
సమయానికి బస్సు రాకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్దులు ఉండగా...అందులో 20 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్దానికంగా ఉన్న ఆటోడ్రైవర్లు 108 సిబ్బందికి ఫోన్ చేసి హుటహుటిన గాయపడిని విద్యార్దులను రూయా ఆస్పత్రికి తరలించారు.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి రోడ్డు దాటడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బస్సును ఇక్కడ చూడొచ్చు.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
తనపల్లె క్రాస్ వద్ద పాఠశాల బస్సును చిత్తూరు నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న లారీ అతివేగంగా ఢీకోని దాదాపు పది అడుగుల దూరం వరకు లాక్కెళ్లింది.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
మదర్ ల్యాండ్ స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు రుయాస్పత్రి డాక్టర్లు వైద్యం అందిస్తున్న దృశ్యం.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
తనపల్లి నల్లమాను కాలువకు చెందిన తనూష్ బాబు, చింటు, శ్రీలత, పూజిత, స్వాతిలకు ముఖం, చేతులు, కాళ్లపై... రిషిత, విష్ణువర్దన్కు తలపై గాయలయ్యాయని డాక్టర్లు తెలిపారు.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
తనపల్లి నల్లమాను కాలువకు చెందిన తనూష్ బాబు, చింటు, శ్రీలత, పూజిత, స్వాతిలకు ముఖం, చేతులు, కాళ్లపై... రిషిత, విష్ణువర్దన్కు తలపై గాయలయ్యాయని డాక్టర్లు తెలిపారు.
తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
ఈ ప్రమాదం గురించి తెలిసిన కలెక్టర్ సిద్దార్ద్ జైన్ రుయూస్పత్రికి చేరుకుని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

తనపల్లె క్రాస్ వద్ద లారీ ఢీకొన్నస్కూల్ బస్సు
బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించి, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.












Click it and Unblock the Notifications