ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రెండు జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్, పెరిగిన రికవరీ, తగ్గిన టెస్టులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా 300కు దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 25,532 నమూనాలను పరీక్షించగా.. 220 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు, నలుగురు మృతి
కొత్తగా నమోదైన 220 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,66,670కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,377కి పెరిగింది.

ఏపీలో 4142కు తగ్గిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 429 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,48,151కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 4,142 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,95,44,319 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 51 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసూ కూడా నమోదు కాలేదు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 02, చిత్తూరులో 33, తూర్పుగోదావరిలో 51, గుంటూరులో 26, కడపలో 16, కృష్ణాలో 21, కర్నూలులో 00, నెల్లూరులో 19, ప్రకాశంలో 11, శ్రీకాకుళంలో 19, విశాఖపట్నంలో 18, విజయనగరంలో 00, పశ్చిమగోదావరిలో 04 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,887, చిత్తూరులో 2,46,968 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,967) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 8.81,379 నమూనాలను పరీక్షించగా.. 12,514 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42కోట్లు దాటింది. ఆదివారం 251 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,58,437కి చేరింది. గత 24 గంటల్లో 12,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,58,817కి తగ్గింది. దీంతో పాజిటివిటీ రేటు 0.46 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.20 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో 12,77,542 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 106 కోట్ల మందికిపైగా టీకా పంపిణీ జరిగింది.












Click it and Unblock the Notifications