అనంతలో బోల్తా పడిన బస్సు: 30 మందికి గాయాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల వల్ల ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణీకులతో ఆదివారం రాత్రి బెంగుళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేశినేని ట్రావెల్స్కు చెందిన బస్సు అనంతపురం జిల్లా పరిధిలో బోల్తాపడింది.
జిల్లాలోని గుత్తి మండలం కొత్తపేట వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది ప్రయాణీకులకు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Comments
English summary
Road accident took place in Anantapur District . The accident took place when a volvo bus which belongs to Kesineni travels which was on the way to Bangalore from Hyderabad overturned near Kothapet in Gooty mandal.
Story first published: Monday, May 18, 2015, 9:13 [IST]