షాకింగ్: ఆమెకు 30, భర్తతో గొడవపడి 16 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయిన వైనం
ఒంగోలు: ఓ ముప్పై ఏళ్ల మహిళ 16 ఏళ్ల బాలుడితో పారిపోయిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలుడు, ఆమె పక్కపక్క ఇళ్లలో ఉంటారు.
వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా సన్నిహిత సంబంధం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భార్య తాను ఊరు వెళ్తున్నానని చెబుతూ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అదే రోజు నుంచి బాలుడు కూడా కనిపించలేదు. అతని సెల్ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది.

బాలుడి స్నేహితులను విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కనిపించటం లేదని ఫిర్యాదు చేయడంతో పాటు అతను వెళ్లిపోవడానికి గల కారణం చెప్పారు. దీంతో పోలీసులు బాలుడి అదృశ్యం కేసు నమోదు చేసి, ఇద్దరి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications