రేకుల షెడ్డులో కోచింగ్: వడదెబ్బతో మూడో తరగతి అమ్మాయి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కొడిగినహళ్లిలోని ఓ కోచింగ్ సెంటర్లో వడదెబ్బతో ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మూడో తరగతి విద్యార్థిని నిఖిత చికిత్స పొందుతూ మృతి చెందింది.
దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఓ స్కూల్లో ప్రవేశం కోసం విద్యార్థులకు కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటన పైన ఇంఛార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం విచారణకు ఆదేశించారు.

ఆ కోచింగ్ సెంటర్ రేకుల షెడ్డులో ఉంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రేకుల షెడ్డులో విద్యార్థులందర్నీ ఉంచడంతో అస్వస్థతకు గురయ్యారు. అసలే ఎండ, పైగా రేకుల షెడ్డు కావడంతో ఘోరం జరిగింది. విద్యార్థులు డిహైడ్రేషన్కు గురయ్యారు. నిర్వహకుల పైన కేసు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 2, 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఏపీలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల నగరాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. మహబూబ్నగర్లో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications