Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయ్- అధిగమిస్తాం: టీటీడీ

Tirumala: దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగుర వేశారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కట్టిపడేశాయి.

గణతంత్రి దినోత్సవ వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో తిరుమల తిరుపతి అద‌న‌పు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. టీటీడీ అమలు చేస్తోన్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోన్నామని అన్నారు.

76th Republic Day TTD AEO Ch Venkaiah Chowdary hoisted the National Flag in Tirumala

శ్రీవారి సేవకుల సహాయంతో తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోన్నామని, వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మరింత సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, ఇత‌ర వ‌స‌తులను పార‌ద‌ర్శ‌కంగా క‌ల్పించ‌డ‌మే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెంక‌య్య చౌద‌రి అన్నారు.

ప్ర‌పంచం న‌లుమూలల‌ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు టీటీడీ ఉద్యోగులు సమష్టి కృషితో పని చేసి మ‌రింత మెరుగైన సేవ‌లను అందించాల‌ని పిలుపునిచ్చారు. గ‌త ఏడాది అక్టోబ‌రులో శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామ‌ని వివరించారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామ‌ని పేర్కొన్నారు.

భ‌క్తుల‌కు మ‌రింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. జ‌న‌వ‌రి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు 6.80 లక్షల మంది భ‌క్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న‌ట్లు చెప్పారు. దాదాపు 96 శాతం మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు.

తిరుమ‌ల‌లో వసతి గదుల కేటాయింపులో ఉన్న‌ సమస్యలు ప‌రిష్క‌రించి, మ‌రి కొన్ని కాటేజిలో మరమ్మతులు త్వ‌ర‌గా పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమ‌ల‌లో అన్నదానం, పారిశుద్ధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పని చేస్తున్నాయ‌ని ప్రశంసించారు.

76th Republic Day TTD AEO Ch Venkaiah Chowdary hoisted the National Flag in Tirumala

టీటీడీ ఐటి విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకొని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామ‌ని ఆయన హామీ ఇచ్చారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-హుండీ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్క్‌లల్లో యుపీఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నార‌ని చెప్పారు.

నిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+