8 ఏళ్ల బాలుడు కిడ్నాప్, హత్య: విషాదంలో కుటుంబం
విశాఖ: అనకాపల్లి మండలం గౌరపాలెంలో ఉదయ్ (8) అనే బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలువలో వెలుగు చూసింది. 24 గంటల క్రితం గౌరపాలెంకు చెందిన ఉదయ్ పాఠశాలకు వెళ్లి రాలేదు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఏలేరు కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం ఉదయ్ది అని గుర్తించారు.

శుక్రవారం రాత్రి ఉదయ్ని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.ఒక లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. శనివారం గౌరుపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు.
అయితే, ఇది కేవలం ఆకతాయిగా, డబ్బు కోసం చేశామని, తమ వద్ద బాలుడు లేడని.. శేఖర్ అనే వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బాలుడు శవమై కనిపించాడు. పోలీసులు శేఖర్ కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులను ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications