సైకో వీరంగం, పదేళ్ళ బాలిక మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
విశాఖ పట్టణంలో సైకో వీరంగం సృస్టించాడు. మద్యం మత్తులో కత్తిపట్టుకొని అడ్డువచ్చిన వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పదేళ్ళ బాలిక మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖ పట్టణం :విశాఖ పట్టణంలో సైకో వీరంగం సృస్టించాడు.సైకో దాడిలో ఓ బాలిక మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సైకోను పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
విశాఖ పట్టణంలోని కైలాసపురంలోని ఓ సైకో శుక్రవారం నాడు ఉదయం వీరంగం సృష్టించారు. కత్తితో స్థానికులపై దాడి చేశాడు. ఈ దాడిలో పదేళ్ళ బాలిక మరణించింది, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మద్యం మత్తులో ఉన్న సైకో చేతిలో కత్తి పట్టుకొని అడ్డువచ్చిన వారిని ఇష్లమొచ్చినట్టు పొడిచాడు. ఈ ఘటనతో పదేళ్ళ బాలిక తీవ్రంగా గాయపడింది.అయితే ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మరో వైపు ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
సైకో ను పట్టుకొనేందుకు స్థానికులు వెంటపడ్డాడు. కైలాసపురం రెండో వీధిలోకి పోరిపోయాడు నిందితుడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. దీంతో అతన స్పృహ కోల్పోయాడు. సైకోను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications