సైకో వీరంగం, పదేళ్ళ బాలిక మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
విశాఖ పట్టణంలో సైకో వీరంగం సృస్టించాడు. మద్యం మత్తులో కత్తిపట్టుకొని అడ్డువచ్చిన వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పదేళ్ళ బాలిక మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖ పట్టణం :విశాఖ పట్టణంలో సైకో వీరంగం సృస్టించాడు.సైకో దాడిలో ఓ బాలిక మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సైకోను పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
విశాఖ పట్టణంలోని కైలాసపురంలోని ఓ సైకో శుక్రవారం నాడు ఉదయం వీరంగం సృష్టించారు. కత్తితో స్థానికులపై దాడి చేశాడు. ఈ దాడిలో పదేళ్ళ బాలిక మరణించింది, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మద్యం మత్తులో ఉన్న సైకో చేతిలో కత్తి పట్టుకొని అడ్డువచ్చిన వారిని ఇష్లమొచ్చినట్టు పొడిచాడు. ఈ ఘటనతో పదేళ్ళ బాలిక తీవ్రంగా గాయపడింది.అయితే ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మరో వైపు ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
సైకో ను పట్టుకొనేందుకు స్థానికులు వెంటపడ్డాడు. కైలాసపురం రెండో వీధిలోకి పోరిపోయాడు నిందితుడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. దీంతో అతన స్పృహ కోల్పోయాడు. సైకోను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.