కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాము కాటుకు బాలుడు మృతి, లేస్తాడని పూజలు

|
Google Oneindia TeluguNews

Boy
కర్నూలు: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో నివాసముంటున్న ఇద్దరు దంపతులు తమ కుమారుడు గిరిజప్ప(4)ను తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని మంత్రాలయం ఆలయానికి శుక్రవారం వచ్చారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటున్న సమయంలో గిరిజప్ప ఓ వస్తువు కింద పడడంతో ఆలయంలోని హుండీ కింద చేయి పెట్టాడు. అక్కడే ఉన్న పాము గిరిజప్పను కాటు వేసింది. దీంతో గిరిజప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతి చెందిన గిరిజప్పను ఇంటికి తీసుకుపోయిన తల్లిదండ్రులకు ఓ స్వామిజీ వచ్చి ఆ బాలుడు చనిపోలేదని, కొంత సమయం తర్వాత లేస్తాడని చెప్పడంతో శనివారం వరకూ ఇంట్లోని మృతదేహాన్ని ఉంచుకున్నారు. స్వామిజీ చెప్పినట్లుగా బాలుడి మృత దేహానికి పశువుల పేడ రాసి వారి ఇంటి ముందు ఉంచారు. రాఘవేంద్ర స్వామి పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు.

ఎవరో స్వామి చెప్పారని చనిపోయిన బాలుడు బ్రతికి వస్తాడని నమ్మడం ఏంటని పలువురు స్థానికులు అంటున్నారు. గిరిజప్ప చనిపోయి సుమారు 24గంటలు గడిచినప్పటికీ కుటుంబ సభ్యులు ఇంటి ముందు పెట్టుకుని భజనలు చేస్తున్నారు. ఆ స్వామి ఎక్కడ్నుంచి వచ్చాడో ఎందుకు చెప్పాడో అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

బాలుడు బ్రతికే అవకాశాలున్నాయని కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.

English summary
A Boy died at Mantralayam temple in Kurnool District, after bitten by a snake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X