విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రబాలెం చెరువులో కారు దూసుకెళ్లింది. దీంతో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కృష్ణాయపాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తుండగా.. ఎర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీగా అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగలగొట్టి నలుగురిని బయటకు తీయగా, అందరూ విగత జీవులుగా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మంగళగిరికి చెందినవారిగా గుర్తించారు.
మరో విషాద ఘటన: కాలువలో పడి ఇద్దరు మృతి
సంక్రాంతి పండగపూట విషాద ఘటన చోట చేసుకుంది. కాల్వలోకి స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నీటమునిగి మరణించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది. రాజవరం గ్రామ శివారులో ఉన్న ఎర్ర కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ కావడంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు రాజవరంలో ఉన్న ఎర్ర కాల్వ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అంతా కలిసి కాల్వలోకి స్నానానికి దిగారు.

వీరిలో జెట్టి ముఖేష్( 21) జెట్టి గణేష్ (20) లోతులోకి వెళ్లారు. ఈత రాకపోవడం, కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మిగతా నలుగురు స్నేహితులు గట్టుపైకి చేరారు. వెంటనే ఆ నలుగురు యువకులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు. పండగపూట ఇద్దరు యువకుల మరణంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications