విషాదం: బైక్పై కుప్పకూలిన సెల్ టవర్, వ్యక్తి మృతి, మరో మహిళకు తీవ్రగాయాలు
పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిపై ఈదురుగా గాలులకు పోలీస్ స్టేషన్ కూడలి వద్ద నిరుపయోగంగా ఉన్న సెల్ టవర్ కూలి పడింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెల్ టవర్ పై పిడుగు పడటం వల్లే కూలిందని స్థానికులు చెబుతున్నారు.
ఈదురు గాలులతో టవర్ కూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బొట్టా రాజేశ్(43) అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన వెనుక కూర్చున్న రాణి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో తండ్రి హత్య
అనంతపురం జిల్లా కూడేరు మండలం కడగళ్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కొడుకు తండ్రినే చంపాడు. ఓబన్నను ఆయన కొడుకు జయకృష్ణ మద్యం మత్తులో కొట్టి కిందకు తోయడంతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో పింఛను డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే తండ్రి జయకృష్ణ దాడి చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, జయకృష్ణను కరెంటు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు తరచూ డబ్బుల కోసం తన తండ్రిని వేధించేవాడని గ్రామస్తులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications