చైనాకు చెందిన బడా ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు సేకరించిన ఎర్రచందనం దుంగలను తమ దేశానికి తరలించేందుకు వచ్చిన చైనాకు చెందిన స్మగ్లర్ యాంగ్పింగ్ పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన స్మగ్లర్ యాంగ్పింగ్ను చిత్తూరు పోలీసులు హైదరాబాద్లో శుక్రవారం అరెస్ట్ చేశారు.
చిత్తూరు పోలీసులు పక్కా వ్యూహంతో యాంగ్పింగ్ను పట్టుకోగలిగారు. యాంగ్పింగ్ తోపాటు హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

పెద్దఎత్తున ఎర్రచందనం విదేశాలకు తరలిపోతోందన్న విషయంపై సమాచారం అందుకున్న ఏపి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వీరిని అరెస్ట్ చేశారు. కాసేపట్లో యాంగ్పింగ్ను చిత్తూరు కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇటీవలే పలువురు బడా స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్న 20మంది తమిళనాడు కూలీలను ఎన్కౌంటర్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications