రూ. లక్ష కోసం చిట్ ఫండ్ వ్యాపారి దారుణ హత్య
ఆగస్టు 11న అతడు అదృశ్యమయ్యాడు. 14వ తేదీన ఇస్తేకరుద్దీన్ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. బోధన్కు చెందిన మోసిన్.. ఇస్తేకరుద్దీన్ వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. మోసిన్ తాను తీసుకున్న అప్పు చెల్లిస్తానని ఇస్తేకరుద్దీన్ను ఆగస్టు 11న నవీపేటకు తీసుకొచ్చాడు. మోసిన్, అతడి స్నేహితుడు లాయక్ కలిసి ఇస్తేకరుద్దీన్ గొంతుపైన, కడుపులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.
మృతుడి ఫోన్స్ కాల్స్ ఆధారంగా మోసిన్, లాయక్లను నిందితులుగా గుర్తించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇస్తేకరుద్దీన్ను ఫస్ట్ ప్లాట్లో ఉన్న నీటితొట్టె అడుగున గోతి తీసి పూడ్చి పెట్టారని చెప్పారు.
శుక్రవారం నవీపేట ఎమ్మార్వో అనిల్ కుమార్ సమక్షంలో డాక్టర్ శ్రీధర్చారి ఇస్తేకరుద్దీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అతడు హత్యకు గురైనట్లు ఎస్ఐ చెప్పారు. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.