నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. లక్ష కోసం చిట్ ఫండ్ వ్యాపారి దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

A Chit fund dealer murdered in Nizamabad
నిజామాబాద్: జిల్లాలోని నవీపేట మండలం ఫతేనగర్ గ్రామ శివారులోని ఫస్ట్ ప్లాట్ వద్ద ఓ చిట్‌ఫండ్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పది రోజుల క్రితం అదృశ్యమైన బాధితుడు శవంగా లభించడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. బోధన్ ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. బోధన్‌కు చెందిన ఇస్తేకరుద్దీన్ చిట్ ఫండ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆగస్టు 11న అతడు అదృశ్యమయ్యాడు. 14వ తేదీన ఇస్తేకరుద్దీన్ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. బోధన్‌కు చెందిన మోసిన్.. ఇస్తేకరుద్దీన్ వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. మోసిన్ తాను తీసుకున్న అప్పు చెల్లిస్తానని ఇస్తేకరుద్దీన్‌ను ఆగస్టు 11న నవీపేటకు తీసుకొచ్చాడు. మోసిన్, అతడి స్నేహితుడు లాయక్ కలిసి ఇస్తేకరుద్దీన్ గొంతుపైన, కడుపులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

మృతుడి ఫోన్స్ కాల్స్ ఆధారంగా మోసిన్, లాయక్‌లను నిందితులుగా గుర్తించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇస్తేకరుద్దీన్‌ను ఫస్ట్ ప్లాట్‌లో ఉన్న నీటితొట్టె అడుగున గోతి తీసి పూడ్చి పెట్టారని చెప్పారు.

శుక్రవారం నవీపేట ఎమ్మార్వో అనిల్ కుమార్ సమక్షంలో డాక్టర్ శ్రీధర్‌చారి ఇస్తేకరుద్దీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అతడు హత్యకు గురైనట్లు ఎస్ఐ చెప్పారు. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
A Chit fund dealer murdered in navipet in Nizamabad district on August 11th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X