Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video:ఒక్క అడుగు తేడా..సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు..!!

"మొంథా" తుఫాను విలయతాండవం చేసింది. ఆ దెబ్బకు పెన్నా నది సుడులు తిరిగింది. సరిగ్గా అదే టైమ్‌లో నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ దగ్గర జరిగిన ఒక ఘటన... యావత్ జిల్లా రైతులతో పాటు అక్కడి జనాల గుండెల్లో దడ పుట్టించింది.లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం పెన్నా నదిలో ఉరకలేస్తుంటే... అకస్మాత్తుగా, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోయి, బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది.

ఒక్క అడుగు తేడా: ఊహించలేని నష్టం..
పోటెత్తే వరద ఉద్ధృతికి, ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీని ఆ బోటు ఢీకొని ఉన్నింటే... 85 గేట్లతో కట్టిన సంగం బ్యారేజీ పరిస్థితి అటో ఇటో అయ్యేది.3,85,000 ఎకరాలకు నీళ్లిచ్చే ఈ ప్రాజెక్టు ఏమైనా దెబ్బతింటే,వర్షాకాలం తర్వాత ఆ పొలాలు ఎండిపోయేవి,రైతులు కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు.అంతేకాదు,పొదలకూరు,సంగం లాంటి ఊళ్ల మధ్య రాకపోకలకు ఆధారం ఈ బ్యారేజీనే.అది దెబ్బతింటే, జనజీవనం పూర్తిగా ఆగిపోయేది.గుండె దడ పుట్టించే ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

a-close-shave-how-authorities-saved-sangam-barrage-from-a-30-ton-boat-amidst-cyclonemonthafloods

రంగంలోకి కలెక్టర్, ఎస్పీ
ఈ పెను ప్రమాదం గురించి తెలియగానే... జిల్లా యంత్రాంగం ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఈ ఒక్క క్షణంలోనే జిల్లా భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని భావించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ,ఎస్పీ డా.అజిత వజ్రేంద్ర, హుటాహుటిన అక్కడికి పరుగులు తీశారు.పరిస్థితిని చూసి,అసలు నష్టం జరగకుండా వెంటనే సిబ్బందిని అలెర్ట్ చేశారు.అక్కడి నుంచి మొదలైంది అసలైన పోరాటం.

  • 30 మంది NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) జవాన్లు
  • 30 మంది SDRF (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) యోధులు
  • 100 మందికి పైగా పోలీసు, భద్రతా సిబ్బంది
  • కృష్ణపట్నం పోర్టు టీమ్, ఫైర్, ఇరిగేషన్ ఆఫీసర్లు

ఈ టీమ్‌లంతా కలిసికట్టుగా, అవిశ్రాంతంగా పోరాడారు.సుడులు తిరుగుతున్న పెన్నా ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేశారు.వాళ్ల ధైర్యం,పట్టుదల చూస్తే ప్రకృతి కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది.పెన్నా వరద మధ్య, ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకుపోయే ప్రతి అడుగు... టిక్లింగ్ టైం బాంబ్‌లా అందరి గుండెల్లో దడ పుట్టించింది.చివరికి,ఉత్కంఠకు తెరదించుతూ... ఆ ప్రమాదకరమైన 30 టన్నుల బోటును బ్యారేజీకి కొన్ని మీటర్ల దూరంలోనే చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు.

రైతుల ఆశలు నిలిచాయి
అద్భుతం జరిగింది..ఒక విపత్తు తప్పింది.దాదాపు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ దొరికింది.సంగం బ్యారేజీకి ప్రమాదం లేకుండా పోయింది.రైతులకు, ప్రజలకు జరిగిన ఈ పెద్ద ఉపకారం వెనుక... అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం, తెగువ ఎన్నటికీ మరువలేనివి. సంగం బ్యారేజీ నిలిచింది. రైతుల ఆశలు నిలిచాయి.అందుకే హ్యాట్సాఫ్ టూ టీం ఏపీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+