విషాదం: నారాయణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప: నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కడపలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్లోని తన గదిలో ఈ దారుణానికి పాల్పడింది.
అర్ధరాత్రి దాటిన తరువాత గమనించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో వెంటనే వారు పావనిని కడప రిమ్స్కి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
అయితే పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదంటూ పావని కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు మార్గమధ్యంలో వారిని అడ్డుకొని మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పావని ఆత్మహత్య చేసుకోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

వివాహిత అదృశ్యం
కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై అమర్నాథ్రెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కడప హబీబుల్లా వీధికి చెందిన రజితా బాయి (30)కు ఏడేళ్ల క్రితం అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన హరిసింగ్తో వివాహమైంది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు.
కాగా, రజితాబాయి దసరా పండగ కోసమని పుట్టింటికి వచ్చింది. బుధవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications