విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపిన భర్త

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లాలోని ముత్తుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. భార్య మృతి అనంతరం నిందితుడు పరారయ్యాడు. కుటుంబ కలహాలతోనే భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

మృతురాలి కుటుంబసభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

చెరువులో పడి విద్యార్థి మృతి

A man allegedly murdered his wife

చిత్తూరు: మహాశివరాత్రి సందర్భంగా చెరువులో స్నానానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషాధ ఘటన సదుం మండలకేంద్రంలో మంగళవారం జరిగింది. సదుం మండలకేంద్రానికి చెందిన చంద్ర ఏకైక కుమారుడు దిలీప్(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం మాహాశివరాత్రి సందర్భంగా సదుం మండల కేంద్రంలోని చిక్కరాల చెరువులోకి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు చెరువులో మునిగి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు.

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

తూర్పుగోదావరి జిల్లా తునిలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

English summary
A man allegedly murdered his wife in Nellore district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X