కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: బాలికపై వృద్ధుడు అత్యాచారం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వృద్ధుడు తన మనవరాలి వయస్సున్న బాలిక(8)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కొత్తపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.

అదే గ్రామానికి చెందిన దూదేకుల ఫకృద్దీన్‌ బాలిక తల్లిదండ్రులు పొలం పనుల నిమిత్తం వెళ్లినప్పుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

A old man allegedly raped 8 years old girl

రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

మడకశిర మండలంలోని ఆమిదాలగొంది సమీపంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వాహనం ఢీకొంది అనే విషయాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

ఇది ఇలా ఉండగా కర్నూలులోని రోటరీపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వరలక్ష్మి(27) అనే ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. శింగనమల మండలం సోదనపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో నీలారెడ్డిపల్లి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు.

ఆ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వరలక్ష్మి, తులసి, రామలక్ష్మి, జయలక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వరలక్ష్మి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు, భర్త ఉన్నారు.

English summary
A old man allegedly raped 8 years old girl in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X