మహిళా భక్తులపై సైకో దాడి: ముగ్గురి పరిస్థితి విషమం
మహిళలనే టార్గెట్ చేసిన సైకో వారిపై కర్రలతో విచక్షణా రహితంగా దాడికి దిగడంతో వారి కుటుంబ సభ్యులు సైకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా సైకో దాడికి పాల్పడ్డాడు. నడకదారిలో నరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. బాధితులందరూ తమిళనాడులోని చెన్నైకి చెందిన వారని పోలీసులు చెప్పారు. మహిళలనే టార్గెట్ చేస్తూ సైకో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు ముందు శుక్రవారం కూడా తిరుమల వైపు వస్తున్న వాహనాలపై రాళ్లు రువ్వుతూ అలజడి సృష్టించాడని, అయితే తాము విస్తృతంగా గాలించినప్పటికీ దొరకలేదని పోలీసులు చెప్పారు. మళ్లీ శనివారం ఉదయం కూడా మహిళలపై ఆ సైకో దాడ ికి పాల్పడ్డాడని చెప్పారు.