కూతురి మరణంతో ఆగిన తల్లి గుండె: కృష్ణా ఘటనపై మోడీ దిగ్భ్రాంతి
కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల బంధువుల కన్నీటిగాథలు అందర్నీ కదిలించివేస్తున్నాయి. కాగా, ఈ ఘటన తన కన్నబిడ్డను కోల్పోయిన ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది.
Recommended Video

ప్రకాశం: కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల బంధువుల కన్నీటిగాథలు అందర్నీ కదిలించివేస్తున్నాయి. కాగా, ఈ ఘటన తన కన్నబిడ్డను కోల్పోయిన ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

లీలావతి మృతి
కృష్ణా నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాదంలో మృతిచెందింది దేవాబత్తునలి లీలావతి. ఆమె మృతదేహాన్ని సోమవారం ఉదయం ఒంగోలు తీసుకొచ్చారు. కాగా, లీలావతికి భర్త లేకపోవడంతో తల్లి లక్ష్మీకాంతం వద్దే ఉంటోంది. లీలావతికి ఓ కుమార్తె ఉన్నారు. వీరు మంగమూరు రోడ్లో నివాసముంటున్నారు.

విహారానికి వెళ్లి విగత జీవిగా..
కార్తీక మాసం కావడంతో వాకర్స్ క్లబ్ సభ్యులతో పాటు విహారానికి వెళ్లిన ఆమె విగతజీవిగా తిరిగొచ్చారు. పడవ ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచీ లక్ష్మీకాంతం ఆందోళన చెందారు.

కుమార్తె మరణం తట్టుకోలేక
కుమార్తె మరణవార్త తెలిసి తల్లి లక్ష్మీకాంతం కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం ఉదయం మృతదేహం ఇంటికి చేరుకోవడంతో లక్ష్మీకాంతం తీవ్రంగా రోదిస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. కాగా, లీలావతి కుమార్తె విజయవాడలో చదువుకుంటోంది. లీలావతి, లక్ష్మీకాంతం మృతితో ఆ అమ్మాయి అనాథగా మారింది.
మోడీ దిగ్భ్రాంతి..
కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 17మంది మృతి చెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందని, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications