భర్తను వదిలేసి అష్టకష్టాలు: ఆమెను కిడ్నాప్ చేసి, ఆటో డ్రైవర్ల గ్యాంగ్రేప్
భర్తను వదిలేసి అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా..
తూర్పుగోదావరి: భర్తను వదిలేసి అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. పట్టించుకోకుండా నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆమెను అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.

భర్తను వదిలేసి..
స్థానికులు, ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. 23ఏళ్ల వయస్సున్న బాధితురాలిది తుని మండలానికి చెందినవారు. జులై 3న భర్తతో గొడవపడి అక్కణ్నుంచి బయల్దేరి స్నేహితుల ఇళ్లలో ఉంటూ చివరకు మూడు రోజుల క్రితం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరింది. చేతిలో రూపాయి లేకపోవడంతో ఆకలిని భరిస్తూ బస్ కాంప్లెక్సులోనే ఉంటోంది. అప్పటికే ఆమె బాగా నీరసించిపోయింది.

కిడ్నాప్ చేసి..
ఇది గమనించిన ఓ ఆటో డ్రైవరు మరో ఇద్దరి సాయంతో మంగళవారం రాత్రి ఆమెను కాంప్లెక్సు ఎదురుగా ఉన్న బ్రిడ్జి కిందికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా.. ఆర్టీసీ కాంప్లెక్సుకు కొద్ది దూరంలో వదిలేసి పరారయ్యారు.

ఆమె వివరాలు చెప్పేందుకు ఇష్టపడలేదు..
అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు స్థానికులు నీళ్లు తాగించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు చెప్పినప్పటికీ.. ఆమె అంగీకరించలేదు. ఆమె వివరాలు తెలిపేందుకు ఇష్టపడలేదు.

చికిత్స అందుతుండగానే..
నిందితుల పేర్లు తనకు తెలియవని, వ్యక్తులను మాత్రం గుర్తుపట్టగలనని వైద్యులకు తెలిపింది. ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆమె.. చికిత్స మధ్యలోనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications