ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్...భారీగా లంచం తీసుకుంటూ దొరికిపోయాడు...
విజయవాడ: ఎసిబి వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు భారీగా లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
ఈడ్పుగల్లు కమిషనరేట్లో రూ.22.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏడుకొండలు ఏసీబీకి చిక్కారు. ఈ కేసును ఏసీబీ డీజీ ఠాకూర్ స్వయంగా పర్యవేక్షించారు. ఏడుకొండలును ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుకొండలు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. జిఎస్టి నేపథ్యంలో ఏడుకొండలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండల నుంచి డబ్బు కోసం వేధింపులు తట్టుకోలేక,భారీ మొత్తంలో అతడు డిమాండ్ చేస్తున్న లంచాలు ఇచ్చుకోలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది.

ఇతడు ఇప్పటికే జిఎస్టీ ని అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో అక్రమ సొమ్ము ఆర్జించినట్లు పలువురు వ్యాపారులు ఎసిబి అధికారులకు ఫిర్యాదులు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా కొందరు వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ డీజీ ఠాకూర్ స్వయంగా ప్రణాళిక రచించి ఈ అవినీతి తిమింగలం ఆటకట్టించినట్లు తెలిసింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications