ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారుల దాడులు... ఉద్యోగుల్లో గుబులు
ఏపీలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి . వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు . ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా , నెల్లూరు జిల్లాలలో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఈఈ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఉన్న రికార్డులను, వాస్తవంగా జరిగిన పనులతో సరి పోలుస్తున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు, అన్ని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

మరోవైపు ఆమదాలవలస రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆమదాలవలస రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఏసీబీ దాడులలో గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లుల చెల్లింపు సంబంధించిన రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏక కాలంలో వివిధ జిల్లాల్లో జరుగుతున్న దాడులతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది.
ఏసీబీ అధికారులు తనిఖీలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మెరుపు దాడులు నిర్వహిస్తూ ఏసీబీ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని టెన్షన్ పెడుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి అధికారుల భరతం పట్టమని, పారదర్శకంగా పనులు జరగాలని చెప్పిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టిసారించి రంగంలోకి దిగాయి. దీంతో ఉద్యోగ వర్గాల్లో గుబులు పుడుతుంది .
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications