ఏపి స్పీకర్ కాన్వాయ్లో వాహనం బోల్తా: ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
అనంతపురం: జిల్లాలోని కణేకల్లు మండలం ఆదిగానిపల్లె వద్ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాన్వాయ్లోని ఒక వాహనం బోల్తా పడింది. జీపు బోల్తా పడటంతో ఓ ఎస్ఐ, ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి కూలీ మృతి
సిమెంటు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో సోమవారం చోటు చేసుకుంది.
రామకుప్పం మండలంలోని శాంతిపురం నుంచి వీర్నమల గ్రామం వైపు వెళ్తున్న సిమెంటు ఇటుకల ట్రాక్టర్ వీర్నమల వద్ద బ్రేక్ ఫెయిలై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కూలీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.