అంత మాత్రాన నేతలకు లింక్లున్నట్లు కాదు: కాల్మనీపై కామినేని
విజయవాడ: కాల్ మనీ కేసుల్లో చిక్కుకున్న నిందితులతో పొటోలు దిగినంత మాత్రాన వారితో రాజకీయ నేతలకు సంబంధాలున్నట్లు కాదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు అన్నరాు. కాల్ మనీలో అన్ని పార్టీలవాళ్లూ ఉన్నారని, అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందినవారు ఎక్కువ మంది ఉన్నారని ఆయన అన్నారు.
కాల్ మనీపై గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం మోపారని, కాల్ మనీలాంటి ఆగడాలను నిర్మూలించడానికే కేంద్రం ముద్రా బ్యాంకును ఏర్పాటు చేసిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఈ నెల 19వ తేదీన మంగళగిరి వద్ద ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్కు కేంద్ర మంత్రి జెపి నడ్డా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన చెప్పారు.
రూ.1618 కోట్లతో 193 ఎకరాల్లో 900 పడకల ఆస్పత్రిని మూడేళ్లలో నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రిలో పూర్తిగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications