తవ్వేకొద్దీ సినీ నటుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి!
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని బార్లో తప్పతాగి చిందులు వేయడమే కాకుండా సిబ్బంది పైన దాడికి పాల్పడిన నటుడు ఉదయ్ను రెండో రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అతని గురించిన షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
తవ్వేకొద్ది ఎన్నో నిజాలు వెలుగు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అతడి చేతిలో మోసపోయిన పలువురు పోలీస్ స్టేషన్కు వరుస కడుతున్నారని అంటున్నారు.

కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని జిఆర్టీ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం రాత్రి తప్పతాగి గందరగోళం సృష్టించిన కేసులో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు, తనను అభాసుపాలు చేస్తున్న మీడియా పైన పరువు నష్టం దావా వేస్తానని నిందితుడు ఉదయ్ చెప్పారని తెలుస్తోంది. తన పైన తప్పుడు కేసులు బనాయించారని అతను వాపోయారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications