ప్రత్యేక హోదా: పవన్ కళ్యాణ్ దారిలో హీరో శ్రీకాంత్
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బెంగళూరు/అమరావతి: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడలోని ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ శనిమహాత్మ దేవస్థానాన్ని శ్రీకాంత్ సందర్శించారు.
ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శని దోష నివారణకు నవగ్రహ హోమం చేశారు. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో గణపతి, లక్ష్మి, శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాల్సిందేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే భావితరాలకు మంచి జరుగుతుందని శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పావగడకు రాకముందు శ్రీకాంత్ బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ఘాటీ సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్ర్యతేక పూజలు చేశారు. కర్ణాటకలోని గంగావతికి చెందిన శ్రీకాంత్ తెలుగు సినీపరిశ్రమంలో స్థిరపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications