ముద్రగడకు సినీ తారల మద్దతు: చిరు-దాసరి తర్వాత నటి హేమ
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సినిమా తారల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ సినీ నటి హేమ ఆదివారం నాడు ముద్రగడను పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన నివాసానికి హేమ వచ్చారు.
ముద్రగడ పైచేయి సాధించినా..: చిరు-దాసరిని ఇరుకునపడేసిన బాబు!ఈ సందర్భంగా ఆమె ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని, ఆయన కుటుంబ ఆరోగ్య పరిస్థితిని గురించటి అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలని ముద్రగడ ఇటీవల పదమూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.

ఆయన దీక్షకు కాపు నేతల నుంచి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే. కాపు నేతలు ఆయన దీక్షకు మద్దతుగా సమావేశాలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా.
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు, కాంగ్రెస్ నేతలు పళ్లం రాజు, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు పలుమార్లు ముద్రగడ దీక్షకు మద్దతుగా సమావేశమయ్యారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications