టీడీపీలో నాపై కక్షకట్టారు! అవమానం, ఊహించలేదు: బీజేపీలో చేరిన నటి కవిత
విజయవాడ: ఓ వైపు టీడీపీ నేతల విమర్శలు, అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్యనేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ నుంచి పార్టీ సహ సంఘటన కార్యదర్శి సతీష్ జీ హాజరయ్యారు. టీడీపీతో పొత్తు దాదాపు విచ్చిన్నమైన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ, టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా జవాబివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కీలక చర్చ
అంతేగాక, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకెళ్లాలనేదానిపై నేతలు చర్చించారు. ఇకపై తెలుగుదేశం పార్టీతో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రభుత్వా న్ని ఎలా ఎదుర్కొనాలనే అంశంపైన నేతలు సమాలోచనలు చేశారు

బీజేపీలో చేరిన సినీ నటి కవిత
ఈ సందర్భంగా సినీనటి కవిత కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు టీడీపీలో చాలాకాలం పాటు కొనసాగిన కవిత గత మహానాడులో తనకు అవమానం జరిగిందని కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

నాపై కక్షకట్టారు
బీజేపీలో చేరిన సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీడీపీని వదిలిపెట్టాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. కొందరు కక్ష్యగట్టి తనను బయటకు వెళ్లిపోయేలా చేశారని కవిత ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నిస్వార్థంగా పని చేశానని... ఇపుడు తనకు ఆ పార్టీలో సరైన గౌరవం లేకపోవటంతో దూరంగా ఉన్నానని తెలిపారు.

మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి..
నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భేటీ బచావో భేటీ పడావో వంటి పథకాలకు ఆకర్షితులై బిజెపిలో చేరినట్లు కవిత చెప్పారు. కాగా, కవితతో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు హరిబాబు తెలిపారు. దేశాభివృద్దిని కోరుకునే వారంతా భాజపా వైపు రావాలని పిలుపునిచ్చారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications