పులివెందుల పూల అంగళ్ల ముందే జగన్ చిట్టా విప్పుతా: ఆదినారాయణ రెడ్డి
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తులు రూ.6 లక్షల కోట్లని, పులివెందుల పూల అంగళ్లముందే ఆయన చిట్టా విప్పుతానని కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగులో సోమవారంటీడీపీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్నాయుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జగన్పై విరుచుకుపడ్డారు. నాడు లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందని అన్నారు. జగన్కు చెక్పెట్టేందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు.

మాజీమంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానన్నారు. అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాననని, తనను ఇబ్బందిపెడితే తానూ ఇబ్బంది పెట్టేందుకు వెనుకాడనన్నారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నందువల్లే టీడీపీలో చేరామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభకు గెలిచిన ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన సోదరుడు దేవగుడి నారాయణ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications