'పవన్ కళ్యాణ్ మౌనం ఆశ్చర్యం వేసింది': అధికారుల నిలదీత తర్వాతే..
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. దీనిపై చంద్రబాబు, టిడిపి సమాధానం చెప్పాలని నిలదీశారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. దీనిపై చంద్రబాబు, టిడిపి సమాధానం చెప్పాలని నిలదీశారు.
అయితే ఆయన స్పందించడానికి ముందే ఐఏఎస్లు పలువురు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, గతంలో ఉత్తరాది - దక్షిణాది అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించక పోవడం వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో పవన్ స్పందించారంటున్నారు.

ఏపీ ఐఏఎస్ల అసంతృప్తి
రాష్ట్రానికి చెందిన అధికారులను కాదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి ఈవో పదవి కట్టబెట్టడంపై పలువురు ఏపీ ఐఏఎస్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆదివారమే అధికారులు గుసగుసలాడుకున్నారని తెలుస్తోంది.

ఆ ప్రశ్నలు సరే..
గతంలో పలు విషయాల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ టిటిడి ఈవో నియామకంపై ఆయన ఎందుకు స్పందించడం లేదని అధికారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ప్రశ్నించేందుకే జనసేన పుట్టిందన్న పవన్.. ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు.

చంద్రబాబు సర్కార్ మాటేమిటి
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ కురిపిస్తోందని కూడా పవన్ గతంలో వ్యాఖ్యానించారు. అలాంటిది చంద్రబాబు సర్కార్.. సొంత రాష్ట్రానికి చెందిన అధికారులను పక్కన పెట్టి ఉత్తరాది అధికారికి ఈవో పదవి ఇస్తే ఎలా అని, దీనిపై పవన్ ప్రశ్నించరా అని అభిప్రాయపడ్డారు.

ఎట్టకేలకు పవన్ స్పందన
పవన్ మౌనం ఆశ్చర్యం వేసిందని ఓ అధికారి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం పవన్ స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరాది వారికి తాను వ్యతిరేకం కాదని, కానీ అమర్నాథ్ వంటి చోట్ల మనకు అవకాశం లేనప్పుడు, టిటిడి ఈవోగా ఉత్తరాది వ్యక్తిని ఎందుకు నియమించారని జనసేన అధినేత ప్రశ్నించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications