దావోస్ వెళ్ళొచ్చి చంద్రబాబు కోతలు ..ఒక్కటైనా నిజమైందా.. విజయసాయి ట్వీట్
Recommended Video
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు కోతల రాయుడని అభివర్ణించారు. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ లో స్పందించే విజయ సాయి చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2015లో దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సుకు వెళ్లి వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబు రాష్ట్రానికి రానున్నాయని చెప్పిన ఏ కంపెనీ కూడా ఇంతవరకూ రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన "దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్ ను, డ్వాక్రా ఉత్పత్తులు మార్కెటింగుకు వాల్ మార్ట్ ను ఒప్పించానని, కొబ్బరి నీళ్లను పెప్సీ అమ్ముతుందని చంద్రబాబు కోతలు కోశాడు అని అన్నారు.

ఇక చంద్రబాబు విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా?" అని ప్రశ్నించారు. ఆపై "టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు అంటూ విజయసాయి టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications