అగ్రిగోల్డ్ కేసు:హైకోర్టు కీలక వ్యాఖ్యలు;జీఎస్సెల్ గ్రూప్ కు చివరి అవకాశం
హైదరాబాద్:అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్ గ్రూప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హై కోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసిన జిఎస్సెల్ గ్రూప్ పై పెనాల్టీ వేయాలంటూ దాఖలైన అఫిడవిట్ ను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా వాదనలు విన్న న్యాయమూర్తి జీఎస్సెల్ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు.

జూన్ 5 నాటికి ఆ సంస్థ రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ 10 ఆస్తులను ఎపి ప్రభుత్వం గుర్తించి వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications