వైఎస్సార్ మావాడే-కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ ! వారసత్వంపై వ్యాఖ్యలు..
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, వైసీపీ, వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సాగిన పాలన తీరుతెన్నుల్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉండి ఉండే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్ధితులు ఎలా ఉండేవో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు వైఎస్సార్ కు నివాళులు అర్పిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లిఖార్జున ఖర్గే కూడా తమ పార్టీ దివంగత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎలా పనిచేశారో గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించిన ఆయన.. దివంగత నేత వారసత్వాన్ని మర్చిపోలేమంటూ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజా జీవితానికి చేసిన కృషిని మనం గుర్తుచేసుకుంటున్నామని మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన దృఢమైన కాంగ్రెస్ వ్యక్తి అని, ఆయన కరుణామయ నాయకత్వం మరియు సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసాయని గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం, మేము అతని వారసత్వాన్ని గౌరవిస్తాము మరియు గొప్ప ప్రజా నాయకుడికి మా నివాళులర్పిస్తున్నామంటూ ట్వీట్ లో ఖర్గే తెలిపారు.
We recall the contribution of Former CM of Andhra Pradesh, Y. S. Rajasekhara Reddy to public life.
— Mallikarjun Kharge (@kharge) September 2, 2023
A staunch Congressperson, his compassionate leadership and welfare schemes left an indelible mark on the lives of the people.
In remembrance, we cherish his legacy and pay our… pic.twitter.com/DHEEJinSxF
వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్న వేళ వైఎస్ ను తిరిగి గుర్తు చేసుకుంటున్న ఆ పార్టీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ కు నివాళులు అర్పిస్తూ, ఆయన వారసత్వాన్ని గౌరవిస్తామంటూ ఖర్గే ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం పూర్తయితే రేపు తెలంగాణలో అయినా ఏపీలో అయినా షర్మిల తన తండ్రి పేరుతోనే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు తిరిగి వైఎస్సార్ ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications