జూనియన్ లైన్ ఉద్యోగాల పేరుతో మోసం, తన పేరుతో చీట్..? డీజీపీకి అజేయ కల్లాం ఫిర్యాదు
ఐఏఎస్, ఐపీఎస్ పేర్లతో మోసాలు చేయడం చూశాం. తర్వాత కేటుగాళ్లు కూడా పట్టుబడ్డారు. అయితే సీఎం ముఖ్య సలహాదారు పేరుతో మోసాలు మాత్రం ఇప్పుడే వెలుగుచూశాయి. దీనిని అజేయ కల్లం సీరియస్గా తీసుకున్నారు. తన పేరుతో జరుగుతోన్న మోసాలపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
తన పేరుతో జరుగుతోన్న మోసాలపై నిగ్గు తేల్చాలని అజేయ కల్లాం ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో ఓ గ్యాంగు తన పేరు చెబుతూ జూనియర్ లైన్ మన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తోందని, ఈ మేరకు వాట్సాప్లో మేసెజ్ సర్క్యులేట్ అవుతోందని తెలిపారు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు తన పేరు వాడుకుందని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇందులో నిజనిజాలు తెలియడం లేదని అజేయ కల్లం పేర్కొన్నారు.

ఆ ఆరోపణలే నిజమని తేలితే నిరుద్యోగులను మోసం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం అన్నారు. లేదంటే ఆ సందేశాలు తప్పని తేలితే, ఫేక్ మెసేజ్ ఎవరు పంపారో తేల్చాలని కోరారు. వారిని గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications