ఏపీలో జియో జోరు- ఒకేసారి వంద టవర్లను ప్రారంభించిన జగన్
అమరావతి: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో మొబైల్ నెట్వర్క్ వ్యవస్థ రాష్ట్రంలో మరింత మెరుగుపడింది. గ్రామాలకు సైతం 4జీ జియో సేవలు అందనున్నాయి. ఏజెన్సీ ఏరియాలు, మారుమూల గ్రామాలకు సైతం నెట్ వర్క్ను విస్తరించింది రిలయన్స్ జియో యాజమాన్యం. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 100 జియో టవర్లను నిర్మించింది.
వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఒకేసారి వంద జియో టవర్ల నెట్ వర్క్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానంలో వాటన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా జియో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్టయింది.

ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వంద జియో టవర్లను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వైఎస్ జగన్.. రిలయన్స్ జియో ప్రతినిధులను అభినందించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జియో 4జీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న టెలిమెడిసిన్ సేవలు మరింత మెరుగుపడతాయని భావిస్తోన్నారు. మొబైల్ నెట్ వర్క్ బలోపేతం కావడం గ్రామస్థాయిలో పౌర సేవలను కూడా మరింత వేగవంతం చేయొచ్చని చెబుతున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications