అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళ పర్యటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన శనివారం గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లారు. సిఎం కేరళ రెండు రోజుల పర్యటనలో ముందుగా అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శిస్తారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు పర్యాటక రంగానికి సంబంధించి కేరళ టూరిజం శాఖ కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుంటారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళ పర్యటన నుంచి తిరిగివచ్చి సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
English summary
amaravathi: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu today left on a two-day visit to kerala to visit international convention centre and participate various programmes.
Story first published: Saturday, November 11, 2017, 14:07 [IST]