క్రైమ్ ఈ-ట్రాకింగ్: ఇకపై...ఆన్లైన్లో క్రైమ్ రికార్డులు
అమరావతి:జాతీయ ఈ- గవర్నెన్స్ ప్రణాళికలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్స్ (సిసిటిఎన్ఎస్) ప్రాజెక్టును రాష్ట్రంలో సమర్థంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక అపెక్స్ కమిటీ అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన సమావేశమైంది. కేంద్రం నిధులతో అమలు చేసే ఈ ప్రాజెక్టును ఈ-కాప్స్ కింద రాష్ట్రంలో సుమారు 1,019 పోలీసు స్టేషన్లకు అనుసంధానించనున్నారు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన నేరాలన్నింటినీ ఈ- ట్రాకింగ్ విధానంలో ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తారు.
ఈ- ట్రాకింగ్ నేర పరిశోధనకు, నిరోధానికి సమర్ధవంతంగా ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ- ట్రాకింగ్ అనువర్తనం చేసిన డేటాబేస్ లో పొందుపరిచిన నేరాలు, నేరస్తులు చరిత్ర షీట్లు, వాటి యొక్క బయోమెట్రిక్స్ ఇందుకు తోడ్పడతాయి. డిజిపి మాలకొండయ్య మాట్లాడుతూ.