తమిళనాడు మ్యూజియంలో 'అమరావతి' శిల్పాలు, ఇవ్వాలని లేఖ
అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి తమిళనాడు నుంచి అపురూప శిల్పాలు తరలించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అప్పటి అమరావతిలోని కొన్ని వందల శిల్పాలను చెన్నై ఎగ్మోర్లోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రంగా ఉంచారు.
ఇప్పుడు నవ్యాంధ్రకు రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటిని ఏపీకి తీసుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.త ఇప్పటికే ఈ శిల్పాల గురించి ఆంధ్రా ఉన్నతాధికారులు తమిళనాడుకు లేఖ రాశారు. దాని పైన తమిళనాడు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తగిన నివేదిక ఇవ్వాలని ఇప్పటికే తమిళనాడు అధికారులు ఎగ్మోర్ మ్యూజియం అధికారులను ఆదేశించారు. అలనాటి అమరావతిలో బౌద్ధులకు సంబంధించిన శిల్పాలు 400కు పైగా ఇప్పుడు ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్నాయి.
నాడు బ్రిటిష్ పాలకులు నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. వాటిని చెన్నైకు తీసుకు వెళ్లి భద్రపరిచారు. కాగా, ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్పాలు మన అరుదైన సంపద అని డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు వీరాంజనేయులు జాస్తి చెప్పారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications