అమరావతిని ముంచెత్తిన వరద..!!
కృష్ణా నది మహోద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరదనీరు నదిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాల్లో వరదనీరు చేరింది. అమరావతి తో సహా తుళ్లూరు మండలంలోనూ పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లోతో కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం అధికారులు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కరకట్ట పరిసరాలు
అమరావతి నుండి సిఎం చంద్రబాబు ఇంటి వైపుగా ఉండే కృష్ణా కరకట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కృష్ణ కరకట్ట వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు. దీని ప్రభావంతో రాజధాని ప్రాంతంలో ముంపు పెరగనుంది. ఇప్పటికే గంట గంటకు పెరుగుతున్న ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లోతో ఆందోళన పెరుగుతోంది. గత 120 సంవత్సరాల్లో రికార్డులను అధిగమిస్తూ భారీగా వరద నీరు వచ్చింది. 1903, 2009లో వచ్చిన వరద రికార్డులను అధిగమిస్తూ 11.37 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరింది.

పెరుగుతున్న వరద
తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగింది. అక్కడ ఉన్న వారిని తరలించారు. అమరావతి లోని అమరేశ్వర ఆలయం, పోలీసు స్టేషన్, పట్టణం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలువురి నివాసాలు వరద నీటిలో ఉన్నాయి. స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అమరావతి పరిధిలో కరకట్ట తెగితే ప్రమాదమని ముందే మట్టికట్టలు వేసిన గ్రామస్థులు అప్రమత్తం అయ్యారు.
అప్రమత్తం
ఇటు ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల చేసారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. బ్యారేజ్ నుంచి 11.42 లక్షల క్యూసెక్కులు విడుదల అయింది. కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల చేయటంతో..ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 24.5 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయింది.
-
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications