అమరావతిలో అవినీతి ఆగింది .. పనులు కాదు... ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. రాజధాని మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేతలు .. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో పనులు ఆగలేదని స్పష్టంచేశారు. అవినీతిని మాత్రం కూకటివేళ్లతో నిర్మూలించామని తేల్చిచెప్పారు.
ఏపీలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన పాలన అవినీతికి నిలువుటద్దం అని విమర్శించారు. ఆయన సోమవారం విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. అక్షరాస్యతలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలువాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని .. అందుకు అనుగుణంగా అందరం కలిసి శ్రమిద్దామని కోరారు.

రాష్ట్రంలోని మహిళల ఆనందం నింపేందుకు మద్యపాన నిషేధం అమలు జరగనుందని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారని గుర్తుచేశారు. కానీ పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదీ సీఎం జగన్ లక్ష్యమని స్పష్టంచేశారు. అర్హులందరికీ పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తేల్చిచెప్పారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు -
గరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications