జగనే తొలి సిఎం, ఆ సమయంలో..: లగడపాటిపై అంబటి

Ambati Rambabu questions Lagadapati's survey
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయలేదని, తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకే ఆయన సర్వేల పేరుతో నాటకాలు ఆడుతున్నారని, జగన్ సిఎం కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం అన్నారు.

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో సర్వేలు చేసినట్లుగా చెబుతున్నారన్నారు. జగన్‌ను దెబ్బతీసేందుకు లగడపాటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో తాము పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తామని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

మేజర్ సర్వేలు అన్నీ తమ పార్టీ వైపే ఉన్నాయని చెప్పారు. తమ పార్టీకి 18 లోకసభ స్థానాలు వస్తాయని చెప్పారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని, ఆ సమయంలో ఎన్నో రాజకీయ మార్పులు జరిగాయని అంబటి అన్నారు. తమ పార్టీకి 110 సీట్లు వస్తాయని చెప్పారు.

సర్వేలు చేయించానని చెబుతూ లగడపాటి తప్పుడు ఫలితాలను వెల్లడిస్తున్నారన్నారు. లగడపాటి నిజంగా సర్వేలు చేయించి ఉంటే ఏ సంస్థతో చేయించాడో వెల్లడించాలని డిమాండ్ చేశారు. లగడపాటి సర్వేలను నమ్మి ఎవరూ బెట్టింగులు కాయవద్దన్నారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి జగనే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+