వంద మంది రాజారెడ్డిలు కలిస్తే జగన్ - అంబటి : అందుకే నా పదవి తీసేసారు - కన్నా..!!
పల్నాడు రాజకీయంలో ఇప్పుడు మంత్రి అంబటి వర్సస్ కన్నాగా మారుతున్నాయి. సత్తెనపల్లి నుంచి టీటీడీ అభ్యర్ధిగా కన్న పోటీ చేయటం ఖాయమైంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ గురించి తెలిసిన కన్నా ఆయన ప్రాపకం కోసం ఏం చేసారో వివరించారు. అటు కన్నా సైతం తాను జగన్ ను విమర్శించినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించే కుట్ర చేసారని ఆరోపించారు.
అంబటి కీలక వ్యాఖ్యలు:టీడీపీ నేత కన్నా ఆరోపణలపై మంత్రి అంబటి సీరియస్ గా స్పందించారు. అవును..వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతారని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి ఏమైనా విలనా..ఆయన రాష్ట్రాినికి రాజశేఖర రెడ్డి, జగన్ ను అందించారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

జగన్ గురించి ముందే తెలిసిన కన్నా గతంలో ఆయన ప్రాపకం కోసం 500 కార్లతో ర్యాలీగా బయల్దేరి, చివరకు గుండెనొప్పి వచ్చిందంటూ ఎందుకు నాటకాలాడారో చెప్పాలని డిమాండ్ చేసారు. బీజేపీ ఎన్నికల డబ్బు మింగేసిన కన్నాకు తనను, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సత్తెనపల్లి నుంచి కన్నా చివరకు పోటీ చేస్తారో..పారిపోతారో తెలియదన్నారు. తాను చంద్రబాబు కాదని.. వైఎస్సార్ శిష్యుడనని పేర్కొన్నారు.
జగన్ ను ప్రశ్నించినందుకే:తాను పుట్టింది రేపల్లెలో..చచ్చేది సత్తెనపల్లిలో అని మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు. అటు కన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్ అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించాలని కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫండ్ దుర్వినియోగం చేసారని నిరాధార ఆరోపణలు చేసారని వివరించారు. తన పై బురద జల్లేందుకే అలాంటి వ్యాఖ్యలు చేసారని వివరించారు. వైసీపీ పాలన అంతం చేయటానికే తాను టీటీడీలో చేరానని కన్నా చెప్పుకొచ్చారు. మంత్రి అంబటి చేసిన ఆరోపణలను ఖండించారు. ముద్రగడ ఏం చేసినా వ్యక్తిగత ప్రాబల్యం కోసమే చేస్తారని కన్నా ఆరోపించారు.
ముద్రగడపై కన్నా ఫైర్:ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతోందని భావించినప్పుడు హడావుడి చేస్తారని కన్నా విమర్శించారు. కాపులకు మేలు చేసిన చంద్రబాబుకు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు.
కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని గోదావరి జిల్లాల్లోనే జగన్ చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. కాపుల కోసం ఒక్క పథకం అయినా అమలు చేసారా అంటూ కన్నా నిలదీసారు. జగన్ సీఎం అయిన తరువా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లేఖ రాసినా పట్టించుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications