ఇక టీడీపీలో ఉండలేను, అపొహలొద్దు 20నే ప్రకటన: తేల్చేసిన ఆనం, జగన్ పార్టీలోకేనా?
నెల్లూరు: గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రామనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ముఖ్య నేతలతో భేటీ
ఆ ప్రచారానికి తోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆనం రామనారాయణ రెడ్డి గైర్హాజరవడంతో ఆయన మార్పు ఖరారైందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులతో బుధవారం సమావేశమయ్యారు.

టీడీపీలో ఇంక ఇమడలేను
ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. టీడీపీలో ఇంక ఇమడలేమని, పార్టీ వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారి తీసిన కారణాలు ఆయన వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు స్పష్టం చేశారు.

20నే ప్రకటన
ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం జూన్ 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

జిల్లా రాజకీయాలపై ప్రభావం
ఈ క్రమంలో మాజీమంత్రి ఆనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డికి జిల్లా స్థాయిలో అనుచరగణం, అభిమానులు, నాయకులు భారీగానే ఉన్నారు. దీంతో ఆనం ఏ నిర్ణయం తీసుకున్న జిల్లా రాజకీయాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపనుంది. ఇటీవల ఆనం వివేకానంద రెడ్డి ఆకస్మకంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications