టీడీపీ 'ఆకర్ష్' ఇప్పట్లో ఆగేలా లేదు: 'మరో 10 మంది చేరేందుకు సిద్ధం'
అమరావతి: ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఇప్పట్లో ముగిసేలా లేదు. నెల్లూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఆయన నెల్లూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో పది మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ తీరు నచ్చకే ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్కు ఒక పద్ధతి, విదానం లేకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారని అన్నారు.

వైసీపీ అధినేత వైయస్ జగన్ మానసికి స్థితి బాగుండాలని అధికారపక్షం కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమ నాయకుడు, సీఎం చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆనం పేర్కొన్నారు.
కాగా, టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ టికెట్పై గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications