అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరు, కోపంతో ఊగిన జెసి

దేవుడు కరుణించకపోతే చంద్రబాబు వాళ్ళ తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరని , అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

By Ajay Mohan
|
Google Oneindia TeluguNews

అనంతపురం: దేవుడు కరుణించకపోతే చంద్రబాబు వాళ్ళ తండ్రి కానీ, మా అబ్బ కానీ ఏమీ చేయలేరని , అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

జిల్లాలో కరువు సమస్యపై సీపీఎం ఆందోళనకు దిగింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశాన్ని సీపీఎం సభ్యులు అడ్డుకొన్నారు. కరువు వల్ల రైతులు నష్టపోతున్నారని సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

jc diwakar reddy

అయితే ఆందోళనను విరమింపజేసేందుకు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధికారుల వద్ద కూర్చోని మాట్లాడాలి. అల్లరి చేసి నశించాలి, నశించాలి అంటే ఏంది నశించేది అంటూ జెసి అసహనం వ్యక్తం చేశారు.

మీరు నిరసన తెలిపారు. రండీ కలెక్టర్ దగ్గర కూర్చోని మాట్లాడుదాం అంటూ సిపిఎం నేతలను ఉద్దేశించి జెసి వ్యాఖ్యానించారు. మరో వైపు హంద్రీనీవాను వెడల్పు చేయాలి, కుంటలు కట్టుకోవాలి, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతోందన్నారు జెసి.

భూమాతను పొడిచి పొడిచి చంపుతున్నాం. ఎక్కడైనా చుక్క నీరు వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. వర్షాలు రాకపోతే ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. దేవుడు కరుణించకపోతే చంద్రబాబు కూడ ఏం చేయలేడు. వాళ్ళ నాన్న ఏమీ చేయలేడు. మా అబ్బా ఏమీ చేయలేడంటూ ఆందోళనకారులనుద్దేశించి జెసి వ్యాఖ్యానించారు.

English summary
Anantapur Mp Jc Diwakar Reddy angry on cpm leaders on Monday. Cpm workers protest at Zp meeting hall on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X