నవరత్నాలా.. నాపరాళ్ళా..జగన్పై జెసి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై అనంతపురం ఎంపీ జెసి దివాకర్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.జగన్ నవరత్నాలు లేవు... నాపరాళ్లు లేవు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ చేపట్టనున్న పాదయాత్రపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్... పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదని. మరోసారి కుండబద్దలు కొట్టారు జెసి దివాకర్ రెడ్డి. వైఎస్ జగన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటేనే మంచిదని జేసీ సూచించారు.

అనంతపురం జిల్లా సమస్యలను తీర్చుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారని, అందుకే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పారు జెసి దివాకర్రెడ్డి. 2019లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు జెసి దివాకర్ రెడ్డి.












Click it and Unblock the Notifications