పవన్ కళ్యాణ్పై వ్యాఖ్య: కెసిఆర్పై కేసుకు కోర్టు ఆదేశం
అనంతపురం/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మురళీ కృష్ణ అనే న్యాయవాది అనంతపురంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఆయన పిటిషన్ స్వీకరించిన అనంతపురం కోర్టు కెసిఆర్ పైన కేసు నమోదు చేయాలని గురువారం అనంతపురం టూటౌన్ పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. 30వ తేదీన కెసిఆర్ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.
కాగా, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, నాటి తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడ్డ విషయం తెలిసిందే.
హెచ్సిఏ పైన పిల్
హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హెచ్సిఏలో కొనుగోళ్లు, నిధుల గోల్మాల్ పైన దర్యాఫ్తునకు ఆదేశించాలని పిటిషన్ దారు ఈ వ్యాజ్యంలో కోరారు.