కెసిఆర్కు ఆంధ్రా ఫోబియా, నిజాం పరకాయ ప్రవేశం: నారాయణ, బాబుపై..
హైదరాబాద్: గోదావరి పుష్కరాల పేరుతో ఇరువురు ముఖ్యమంత్రులు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న భూసేకరణ బిల్లుపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి పైన రేపు హైదరాబాదులోని సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్కు ఆంధ్ర ఫోబియా పట్టుకుందన్నారు. అంతేకాకుండా, ఆయనలో నిజాం నవాబు పరకాయ ప్రవేశం చేసినట్టున్నారన్నారు. ఆయన పాలన నిజాంను తలపిస్తోందన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున అంతమంది మృతి చెందారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
కోటగుమ్మం ఘాట్లో చంద్రబాబు ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందన్నారు. 11 మంది చనిపోయారని చెప్పిన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా తన నివేదికలో పేర్కొన్నారన్నారు. ఎస్పీ పైన ఒత్తిడి తెచ్చి తాను ఇలా చెప్పలేదని చెప్పించే అవకాశాలు లేకపోలేదన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications