సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. నవరత్నాల అమలే లక్ష్యంగా ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం 2,56,256 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. రెవిన్యూ వ్యవయం 2,08,261 కోట్లు కాగా, మూల ధన వ్యవయం రూ 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక..రెవిన్యూ లోటు రూ 17,036 కోట్లు గా వెల్లడించారు. ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక, సంక్షేమ కేటాయింపుల్లో భాగంగా బీసీ సంక్షేమానికి రూ 20,962 కోట్లు ప్రతిపాదించారు. సాంఘిక సంక్షేమం కోసం రూ. 12,728 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు . గణనీయంగా తగ్గిపోయిన రాష్ట్ర రెవిన్యూ కారణంగా కేంద్ర పన్నుల వాటాపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది జగన్ సర్కార్.
ముందు నుంచి చెబుతున్నట్లుగానే జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేసింది. అందులో బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలతో పాటుగా ఆర్దికంగా వెనుక బడిన వర్గాలకు కేటాయింపులు చేసింది. ఇక, సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లను నిధులు కేటాయింపులు చేసారు. రెవిన్యూ లోటు ఉన్నా సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటుంది జగన్ ప్రభుత్వం. ఇలాంటి విషయాలతో పాటు బడ్జెట్కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
Mar 11, 2022, 4:03 pm IST
అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం. హాజరు పేరుతో అమ్మఒడిలో కోతలు పెట్టారు: లోకేష్
Mar 11, 2022, 4:02 pm IST
బడ్జెట్ లో బీసీల ఊసే లేదు. తెచ్చిన డబ్బులను ఏం చేస్తున్నారో చెప్పాలి: లోకేష్
Mar 11, 2022, 2:22 pm IST
ఇది చీకటి బడ్జెట్ . పేదవారికి వ్యతిరేక బడ్జెట్ : టీడీపీ
Mar 11, 2022, 2:20 pm IST
అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది .అయినా పట్టించుకోలేదు : టీడీపీ
Mar 11, 2022, 2:19 pm IST
అమరావతికి ఒక్క రూపాయి కేటాయించలేదు : టీడీపీ
Mar 11, 2022, 2:19 pm IST
పన్ను రూపేణా ఆదాయం పెంచుకుంటున్నారు :టీడీపీ
Mar 11, 2022, 2:18 pm IST
రాజధానిని పూర్తిగా నాశనం చేశారు. మూడు రాజధానుల పేరుతో రెచ్చగొట్టారు :టీడీపీ
Mar 11, 2022, 2:17 pm IST
కేంద్రం ఇచ్చే నిధులతో పబ్బం గడుపుతున్నారు: టీడీపీ
Mar 11, 2022, 2:16 pm IST
పాత పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదం ద్వారా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు : టీడీపీ
Mar 11, 2022, 2:15 pm IST
రాష్ట్ర అప్పుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు: టీడీపీ
Mar 11, 2022, 1:38 pm IST
జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులకు లెక్కలు చెప్పండి: సోము వీర్రాజు
Mar 11, 2022, 1:36 pm IST
పెండింగ్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు : సోము వీర్రాజు
Mar 11, 2022, 1:35 pm IST
ఏపీ బడ్జెట్ చిత్తు కాగితంలా ఉంది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
Mar 11, 2022, 1:19 pm IST
వైఎస్సాఆర్ జలకళకు రూ. 50 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.11,450.94 కోట్లు కేటాయింపు
Mar 11, 2022, 1:18 pm IST
మత్స్యశాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,000 కోట్లు కేటాయింపు
Mar 11, 2022, 12:57 pm IST
రాష్ట్ర బడ్జెట్ నిస్సారంగా, నిరాశజనకంగా ఉంది. అభివృద్ధిపై ఫోకస్ లేని జగన్ ప్రభుత్వ బడ్జెట్ ఇది : సీపీఎం నేత శ్రీనివాసరావు